Saturday, August 4, 2012

Action series #5

I am posting this specifically for Dad, Mom and Akka on their completion of the following assignment #5
  • Prepare two short shares that demonstrate breakthroughs you have had out of participating in the landmark forum or landmark forum action series
    • you can look from the distinctions of rackets, looking good, already always listening, strong suits etc
  • Notice all the meanings, interpretations, and stories that you add to what is happening in your life 
Intention of the series: To leave you able to deal with each and every aspect of your life

Intentions of the session: 
  1. To generate bringing forth the possibility of possibility itself
  2. To distinguish Making a Difference
List all the breakthroughs that you got since Landmark Forum. Distinguish what distinction you have used to get those breakthroughs.

Identify story / interpretation / meaning from the following paragraph:
హైదరాబాద్, న్యూస్‌లైన్: నిధులున్నప్పటికీ అధికారులు బీసీలకు మొండిచేయి చూపిస్తుండటంపై సంబంధిత శాఖ మంత్రి బసవరాజు సారయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లోని వివిధ వృత్తులకు చెందిన ఏడు ఫెడరేషన్లకు బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు తొలి త్రైమాసికంలో ఆర్థిక శాఖ రూ.32 కోట్లు విడుదల చేసినప్పటికీ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పరీదా ఆ నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతుండటమే మంత్రి ఆవేదనకు కారణమని ఆయన సన్నిహితవర్గాల సమాచారం. 

ఫెడరేషన్ల కార్యకలాపాలకు బ్యాంకు లింకేజీ ఉంటే గానీ ప్రభుత్వ నిధులను విడుదల చేయబోమంటూ పరీదా మొండికేయడంపై సారయ్య ఆగ్రహంతో ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ నిధులను విడుదల చేస్తేనే బ్యాంకు లింకేజీ పొందడానికి ఫెడరేషన్లకు అవకాశం కలుగుతుందనేది మంత్రి అభిప్రాయంగా చెబుతున్నారు. కానీ బ్యాంకు లింకేజీ లేకుండా ఫెడరేషన్లకు నిధులు ఇవ్వరాదని సీఎం ఆదేశాలున్నాయని, అందువల్ల సీఎం ఆమోదం తీసుకోవాలని మంత్రికి చెప్పిన పరీదా... నాయీ బ్రాహ్మణ, రజకులు, వడ్డెర, కృష్ణ బాలాజీ, ఉప్పర, బోయ, భట్రాజు ఫెడరేషన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వకపోవడం పట్ల మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. 

మంత్రిగా ఉన్నప్పటికీ ఫెడరేషన్లకు ఆర్థిక సాయం అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని సారయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. విషయం సీఎంకు కలిసి చెప్పినా ఫలితం లేదంటే ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతున్నట్లుందని మంత్రి అనుమానపడుతున్నారని సమాచారం. మరోవైపు సీఎస్‌కు ఫిర్యాదు చేసినా.. సీఎస్.. సీఎం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని వాపోతున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా ఏది చేయాలన్నా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు, ఎర్ర న్నాయుడు, దేవేందర్‌గౌడ్‌లతో చెప్పిస్తేనే చేస్తాననే ధోరణిలో పరీదా వ్యవహరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖలో ఉద్యోగులు చెబుతున్నారు. ఒక విధంగా పరీదా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోవర్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. 

350 మంది కాంట్రాక్టు టీచర్లకు పరీదా ఎసరు

మహాత్మా జ్యోతిరావు పూలె రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీకి బదిలీ అయిన 45 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 350 టీచింగ్ సిబ్బందికి ఎసరు పెట్టేందుకు పరీదా నిర్ణయించారు. పాఠశాలల్లోనే ఉంటూ విద్యార్ధులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కాంట్రాక్టు టీచింగ్ సిబ్బందిని తొలగించి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచింగ్ సిబ్బందిని తీసుకోవాలని పరీదా మెమో జారీ చేశారని కాంట్రాక్టు టీచర్ల అసోసియేషన్ నాయకుడు మోహన్‌రావు శుక్రవారం సచివాలయంలో విలేకరులకు తెలిపారు. కాంట్రాక్టు విధానంలో రిజర్వేషన్ పద్దతిలో ఎంపికై ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్న టీచింగ్ సిబ్బందిని తొలగిస్తూ పరీదా జారీ చేసిన మెమో చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు మోహన్‌రావు తెలిపారు. అయితే న్యాయస్థానం ఆదేశాలను పరీదా అప్పీల్ చేసినా కోర్టు తిరస్కరించిందని ఆయన చెప్పారు. 

అయినప్పటికీ పరీదా తమను తీసుకోకుండా మళ్లీ అప్పీల్‌కు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని మోహన్‌రావు తెలిపారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకం చేస్తే రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్ సిబ్బంది ఉండరని ఆయన తెలిపారు. పరీదా ఇప్పటికైనా న్యాయస్థానం అదేశాలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఇలా ఉండగా బీసీ సంక్షేమ శాఖలో కొంతమంది అధికారులు కాంగ్రెస్ హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు వి.కృష్ణమోహన్ ఆరోపించారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల మాటకు విలువ లేకుండా పోయిందని, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.